Tuesday, September 17, 2024
HomeతెలంగాణManakonduru: సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం

Manakonduru: సీఎం రేవంత్ ఫోటోకు పాలాభిషేకం

ఆర్టీసీ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇచ్చినందుకు..

ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోలకు మండల పార్టీ అధ్యక్షుడు నందగిరి రవి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.

- Advertisement -

ఈ సందర్బంగా నందగిరి రవి మాట్లాడుతూ..ఆర్టీసీ ఉద్యోగులకు లాభాలలో వాటా ఇస్తానని ప్రకటించడం ఎంతో సంతోషకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతుందన్నారు. గంగిపల్లి ఎంపీటీసీ చలిగంటి సంపత్, సింగిల్ విండో డైరెక్టర్ మీస సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాయిరి దేవయ్య, వరహాల చారి, మడుపు ప్రేమ్ కుమార్, కొత్తకొండ శంకర్, రామిడి తిరుపతి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, రామిడి తిరుమల్ రెడ్డి, దేవంపల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ జిడి శ్యామ్, బందెల మహేందర్, నందగిరి రమేష్, చలిగంటి ఓదెలు, మాశం రామకృష్ణ, ఆకునూరి మల్లయ్య, రామగిరి సంతోష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News