Friday, September 20, 2024
HomeతెలంగాణManakonduru: ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

Manakonduru: ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్క రించుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామ గ్రామాన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనూ ఘనంగా ఉత్సవాలు సాగాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లోని మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసన సభ్యులు డా. రసమయి బాలకిషన్. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ జక్కని శ్రీవాణి- రవీందర్, ఉప-సర్పంచ్ మడుపు శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మేంగాని రమేష్ లతో పాటు పార్టీ శ్రేణులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -


-ఎల్ఎండి ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని నీటిపారుదల శాఖ ప్రభుత్వ కార్యాల యలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఘన నివాళులు అర్పించి, జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ పరిధిలోని ఇంజనీర్ చీఫ్ కార్యాలయంలో బి. శంకర్ ఈఏన్సి- కరీంనగర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. దీనితో పాటు సర్కిల్ కార్యాలయాలలో, డివిజన్ కార్యాలయాలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ లు సుమతీ, శివకుమార్, డిప్యూటీ సీఈ రాధాకృష్ణ లతో పాటు పలువురు ఈ.ఈలు, డి.ఈలు ఏ.ఈలు, టీఎన్జీవో నాయకులు, టెక్నికల్, నాన్-టెక్నికల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Manakonduru: ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు
  • పోలీస్ స్టేషన్ లో…
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం తెలంగాణ అవతరణ దినోత్సవంలో భాగంగా ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో తిమ్మాపూర్ సిఐ పర్ష రమేష్, ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
    ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదిత రులు పాల్గొన్నారు.

  • తిమ్మాపూర్ తాహసిల్దార్ కార్యాలయంలో…
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవంలో భాగంగా తిమ్మాపూర్ తహసిల్దార్ కే. కనకయ్య జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొ న్నారు.
    -ఎంపీడీవో కార్యాలయంలో…
    కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవంలో భాగంగా తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత- దేవేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
    ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చింతల రవీందర్ రెడ్డి,
    వైస్-ఎంపీపీ యల్ వీరారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
    -మన్నెంపల్లి గ్రామంలో….
    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరిం చుకొని, దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన్నెంపెల్లి గ్రామంలో జాతీయ జెండా ను ఎగరవేసిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు, ఉప-సర్పంచ్ పొన్నం అనీల్ గౌడ్. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మేడి అంజయ్య, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News