Sunday, July 7, 2024
HomeతెలంగాణManchireddy: 108 అంబులెన్సు లను ప్రారంభించిన ఎమ్మెల్యే

Manchireddy: 108 అంబులెన్సు లను ప్రారంభించిన ఎమ్మెల్యే

వైథ్య ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి నూతనంగా మంజూరు చేసిన 5 (108 ఎమర్జెన్సీ) అంబులెన్స్ లను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దానిలో భాగంగానే సేవలు శరవేగంగా అందించడానికే అంబులెన్సు లను అధికంగా మంజూరు చేస్తున్నారని అన్నారు. అనంతరం త్వరలో ప్రారంభం కానున్న డయాలసిస్ సెంటర్ ను సందర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News