Friday, September 20, 2024
HomeతెలంగాణManchireddy: సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

Manchireddy: సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

పేదలకు ఆరోగ్యపరంగా ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన 8 మంది అనారోగ్యం కారణంగా ప్రయివేటు ఆసుపత్రులలో చికిత్స పొంది ఆర్ధిక సహాయం నిమిత్తం స్థానిక నాయకుల సహాయంతో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయనిది నుండి 3.06లక్షల రూపాయల విలువ చేసిన సిఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించి, తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.
లబ్ధిదారుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం గ్రామానికి చెందిన శివకుమార్ కి 60,000 రూపాయలు, డీ. రాములమ్మ 56,000 రూపాయలు, టి.నర్సింహా కి 52,000 రూపాయలు, ఎన్. బాలకృష్ణ కి 18,000 రూపాయలు, సీ.హెచ్. నాగేశ్వరరావు కి 10,000 రూపాయలు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోహెడకి చెందిన ఎన్. మనూష కి 60,000 రూపాయలు, ఎన్. రమేష్ కి 30,000 రూపాయలు, కే. యాదమ్మ కి 20,000 రూపాయల చెక్కులు కిషన్ రెడ్డి చేతుల మీద గా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News