Monday, July 8, 2024
HomeతెలంగాణManchireddy: హరీష్ రావు పర్యటన విజయవంతం చేయాలి

Manchireddy: హరీష్ రావు పర్యటన విజయవంతం చేయాలి

మంత్రి పర్యటనపై సమావేశం

ఈనెల 17వ తేదీన వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి 68.21 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గం కోర్ కమిటీ నాయకులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశం జరిగింది. మంత్రుల పర్యటన, పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News