Friday, September 20, 2024
HomeతెలంగాణManchireddy: కాంగ్రెస్ పాపాలను ఒక్కొక్కటిగా కడుగుతున్నాం

Manchireddy: కాంగ్రెస్ పాపాలను ఒక్కొక్కటిగా కడుగుతున్నాం

ఎకరానికి 7,40,000 రూపాయల చెక్కులను నిధులు విడుదల

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని బండరావిర్యాల & చిన్నరావిర్యాల గ్రామాలలోని 268 సర్వే నంబర్ లో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దుష్ట పరిపాలన వల్ల భూములు కోల్పోయిన రైతులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వారి సమస్యను తీసుకుపోగా ప్రభుత్వం G.O. 216 ప్రకారం 50 మందికి ఒక్కో ఎకరానికి 7,40,000 రూపాయల చెక్కులను నిధులు విడుదల చేసినందుకు రైతులు దాదాపు 20 ఏడ్ల కలను నెరవేరుస్తున్నందుకు ఎమ్మెల్యే ని కలిగి కృతజ్ఞతలు తెలియజేశారు. మిగిలిన 159మంది రైతులకు కూడా ఇండ్ల స్థలాలను కేటాయిస్తానని దానికి సాయ శక్తులు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా రైతులు లబ్దిపొందుతున్నందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటీ) సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News