Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: 199 మంది బాధితులకు 42 కోట్లు

Manchiryala: 199 మంది బాధితులకు 42 కోట్లు

గడచిన నాలుగు సంవత్సరాలలో చెన్నూర్ నియోజకవర్గంలోని 199 బాధితులకు గాను 42 కోట్ల ఆర్థిక సహాయం అందేలా పట్టుదలతో కృషి చేసి బాధితులకు సహాయపడ్డారు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆరెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఎటువంటి సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు వచ్చిన మీకు నేనున్నానంటూ నిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్.

- Advertisement -

ఆర్థిక భారంతో ఏ ఒక్క మనిషి ప్రాణం పోకూడదనే స్వయంగా తామే ఎల్.ఓ.సి చెక్కులు ఇప్పించడంలో ప్రత్యేక చొరవ చూపిస్తున్నామని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అత్యవసర సమయంలో పేద ప్రజల వైద్యానికి అండగా నిలుస్తున్నారని నియోజకవర్గ ప్రజలంతా సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలు సంప్రదించిన 24 గంటల్లోనే ఆర్థిక సాయం అందించడం ఎమ్మెల్యే పనితనానికి నిదర్శనం అని చెన్నూర్ నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News