Sunday, October 6, 2024
HomeతెలంగాణManchiryala: ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి

Manchiryala: ఐకేపీ వీవోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి

నేన్నెల, కన్నెపల్లి మండల కేంద్రంల్లోని ఐకెపి వివోఏల ఉద్యోగులు నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకెపి వివోఏల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దారుణమన్నారు. రాష్ట్రంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు జీతాలు పెంచిన ప్రభుత్వం వీవోఏలకు జీతాలు ఎందుకు పెంచడం లేదో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం నిరవధిక సమ్మె బాట పట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఐకేపీ వీవోఏల సమస్యలు పరిష్కరించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. వీవోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం చెల్లించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News