Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: జేపీఏస్, ఓపిఎస్ పంచాయతి కార్యదర్శుల ర్యాలీ

Manchiryala: జేపీఏస్, ఓపిఎస్ పంచాయతి కార్యదర్శుల ర్యాలీ

జిల్లా జేపీఏస్, ఓపిఎస్ పంచాయతి కార్యదర్శుల తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జిల్లా కేంద్రంలో ఐబి చౌరస్తానుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ బాధవత్ సంతోష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ కాలం పూర్తి అయినా రెగ్యులర్ కాకపోవడంతో .. తమను రెగ్యులర్ చేయాలంటూ మాంచిరియాల జిల్లాలో పని చేస్తున్న జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయతి కార్యదర్శులు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి జిల్లా పాలనాధికారి బాధవత్ సంతోష్ కు వినతిపత్రం అందజేశారు. రెగ్యులర్ అయ్యే వరకు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు వారు తెలిపారు. ఓపిఎస్ వ్యవస్థను వెంటనే రద్దు చేసి వారిని కూడా రెగ్యులర్ చేయాలని, పని చేసిన కాలాన్ని సర్వీస్ లో పరిగణించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లాని జేపీఏస్, ఓపిఎస్ లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News