Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: హాస్పిటల్లోనే పెళ్ళి..ఎందుకంటే..

Manchiryala: హాస్పిటల్లోనే పెళ్ళి..ఎందుకంటే..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయిన అమ్మాయికి ఆసుపత్రి బెడ్ మీదనే పెళ్లైంది. వరుడు తాళి కట్టి ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. జిల్లాలోని చెన్నూరు మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి పెళ్లి నిశ్చయమైంది. గురువారం వధువు ఇంటి వద్ద వివాహం జరగాల్సి ఉండగా పెళ్లికి ముహూర్తంతో పాటు అన్ని సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే వధువు శైలజ అస్వస్తతకు
గురి కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. వధువుకు ఆపరేషన్ కూడా అవసరం అవ్వడంతో వైద్యులు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.

- Advertisement -

మంచి ముహూర్తానికి పెళ్లి జరగాలనే ఉద్దేశ్యంతో కుటుంబ సభ్యులు డాక్టర్ ను సంప్రదించి వరుడు తిరుపతి ఆసుపత్రి బెడ్పైన ఉన్న శైలజకు అనుకున్న ముహూర్తానికి తాళి కట్టి భార్యగా చేసుకున్నాడు. మొత్తానికి ఆసుపత్రిలోనే పురోహితుల మధ్య వివాహం జరిపించారు. ముహూర్తం దాటిపోవద్దని ఆసుపత్రిలో వివాహం జరిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News