Saturday, November 15, 2025
HomeతెలంగాణManchiryala: ముదికుంట టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్ లో వలస కార్మికులతో రాఖీ పౌర్ణమి

Manchiryala: ముదికుంట టీజీ ఎఫ్ డీసీ ప్లాంటేషన్ లో వలస కార్మికులతో రాఖీ పౌర్ణమి

మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలం, ముదికుంటలో తెలంగాణా అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ ) కు చెందిన నీలగిరి ప్లాంటేషన్ లో రాఖీ పౌర్ణమి సంబరాలు జరిగాయి. ప్లాంటేషన్ లో పనులు చేయడానికి ఛత్తిస్ గడ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన కార్మికులకు ప్లాంటేషన్ వాచర్ టి.శంకర్ తన కూతురు అరుణను తీసుకువచ్చి ఆమె చేత వారికి రాఖీలు కట్టించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. దీంతో వలస కార్మికులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వాచర్ శంకర్ ను మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ అభినదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad