Friday, September 20, 2024
HomeతెలంగాణManchiryala: రైతులకు టార్పాల్స్ అందజేసిన రెడ్ క్రాస్ సభ్యులు

Manchiryala: రైతులకు టార్పాల్స్ అందజేసిన రెడ్ క్రాస్ సభ్యులు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట మండలం చందారం గ్రామంలో రైతు పరస్పర సహాయ సహకార సంఘం లోని 40 మంది రైతులకు రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ సహాయ సహకారాలు అందజేసింది. నాణ్యత కలిగిన ప్లాస్టిక్ తార్ఫాల్స్ ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ… అకాల వర్షాల వల్ల రైతులు పండించిన ధాన్యము తడిచి ముద్దయి రైతులు నష్టపోతున్న పరిస్థితులను గమనించి సహకార సంఘంలో సభ్యులుగా ఉన్న రైతుల అవసరాల నిమిత్తము వర్షము నుండి కాపాడేందుకు రైతులకు మేలు జరిగే ఉద్దేశ్యంతో ఈ తార్పాల్సును పంచే కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు. తమ వంతు సహాయ సహకారాలు మన్మందు కూడా ఇతర కార్యక్రమాల ద్వారా కూడా రైతులకు అందజేస్తామని తెలియచేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యవర్గ సభ్యులు కే.భాస్కర్ రెడ్డి, వి.మధుసూదన్ రెడ్డి, చందూరి మహేందర్, పడాల రవీందర్, కే.సత్యపాల్ రెడ్డి, ఎస్.నాగేందర్ సహకార సంఘ గౌరవ అధ్యక్షులు నయనాల గోవర్ధన్, అధ్యక్షులు సారం మధుకర్, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు లక్ష్మారెడ్డి, రాములు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News