Thursday, April 10, 2025
HomeతెలంగాణManchiryala: విశ్వనాథ ఆలయాభివృద్ధికి 2 కోట్లు మంజూరు

Manchiryala: విశ్వనాథ ఆలయాభివృద్ధికి 2 కోట్లు మంజూరు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పురాతన విశ్వనాథ ఆలయం అభివృద్ధికి ఒక కోటి 97 లక్షల రూపాయలు మంజూరయ్యింది. మంచిర్యాల ఏమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఈమేరకు నిధులు మంజూరు చేశారని ఆలయా కమిటీ పేర్కొంది. పురాతనమైన గుడి కావడంతో ప్రమాదకరంగా ఉండడంతో కొత్తగుడి కొరకు నిధులు మంజూరు చేసినట్టు వారు వివరించారు. ఇందుకు సహకరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం మున్సిల్ చైర్మన్ పెంట రాజయ్య, ఆలయా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News