Saturday, July 20, 2024
HomeతెలంగాణManohar Reddy: మేం వస్తే మహిళలకు బస్సు ఫ్రీ

Manohar Reddy: మేం వస్తే మహిళలకు బస్సు ఫ్రీ

రేవంత్ సీఎం అవుతాడు

బషీరాబాద్ మండలంలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాశింపూర్, కుపన్కోడ్, బద్లాపూర్, బాదులాపూర్ తండా, గొట్టిగా కలాన్, గొట్టిగా ఖుర్దు, కంసాన్పల్లి, మల్కాన్గిరి, రెడ్డి ఘనపూర్, మంతటి గ్రామాల్లో తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు బస్సు ఫ్రీ ఎక్కడ వెళ్లిన టికెట్ తీసుకునే అవసరం లేదు, రైతులకు రుణమాఫీ రెండు లక్షలు ఒకేసారి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు, ఈ అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం అని అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడని సవాల్ విసిరాడు.

- Advertisement -


మల్కనగిరి యువ నాయకులు బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలోకి మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేష్ మహారాజ్, మాజీ జెడ్పిటిసి రాకేష్ మహారాజ్, పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు, సీనియర్ నాయకులు శంకరప్ప రాములు నాయక్ సాయిల్ గౌడ్ పవన్ ఠాకూర్, మస్తాన్, మునీర్ బాయ్, శ్రీకాంత్ , సిద్దు, జగ్గు దాదా, ధన్ సింగ్ , శ్రావణ్ కుమార్, సర్పంచులు పద్మాచందర్ , నీలిబాయ్ పూల్ సింగ్ , సుభాష్, అనురాధ, వెంకటరెడ్డి, యూత్ ప్రెసిడెంట్ రాజ వర్ధన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నరేష్ , ఎంపిటిసి శ్రీధర్, రామకృష్ణ, సైదప్ప , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News