Saturday, April 12, 2025
HomeతెలంగాణManukota: 'సియాసత్' ఎడిటర్ మృతికి మానుకోట జర్నలిస్టుల సంతాపం

Manukota: ‘సియాసత్’ ఎడిటర్ మృతికి మానుకోట జర్నలిస్టుల సంతాపం

నిఖార్సైన జర్నలిస్టు అర్ధాంతరంగా తనువు చాలించాడంటూ సంతాపం

మంగళవారం ప్రజా గాయకుడు గద్దర్ అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చిన సియాసత్ పత్రిక ఎడిటర్ జహీర్ అలీ ఖాన్ అంతిమయాత్రలోనే ఆకస్మికంగా గుండె నొప్పితో మృతి చెందగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మానుకోట జర్నలిస్టులు కొవ్వొత్తులతో ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ‘సియాసత్’ పత్రికను నడుపుతున్న నిఖార్సైన జర్నలిస్ట్ ఇలా ఆకస్మికంగా మృతి చెందడం పత్రికా లోకానికి, పాఠక లోకానికి తీరని లోటు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News