Wednesday, July 16, 2025
HomeతెలంగాణSeethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టులు వార్నింగ్

Seethakka: మంత్రి సీతక్కకు మావోయిస్టులు వార్నింగ్

Maoists letter to Seethakka: తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్కకు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఈమేరకు మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నా.. మంత్రి సీతక్క స్పందించడం లేదని మండిపడ్డారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అయినా కానీ ఈ అంశంపై సీతక్క మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా, 1/70 చట్టాలను సీతక్క మరచిపోయారా…? అంటూ ప్రశ్నించారు.

మాజీ మావోయిస్టు అయిన సీతక్క.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేస్తున్నారన్నారు. అయినా ఆదివాసీల హక్కుల గురించి ఆమె కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేశారు. జీవో నెంబర్. 49తో కుమురం భీమ్ జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపణలు చేశారు.

ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో కారణంగా తెలంగాణలోని మూడు జిల్లాలు కనుమరుగు కాబోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేందుకే ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చిందంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ సర్కార్ 49 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అణచివేతకు గురిచేస్తున్న నేపథ్యంలో ఏకంగా రాష్ట్ర మంత్రికే వార్నింగ్ ఇస్తూ మావోయిస్టులు లేఖ రాయడం సంచలనంగా మారింది. మరి ఈ లేఖపై మంత్రి సీతక్క ఎలా స్పందిస్తారో చూడాలి.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News