Friday, October 18, 2024
HomeతెలంగాణMinister Ponguleti Srinivasa Reddy says Indiramma housing is their priority: ఇందిరమ్మ...

Minister Ponguleti Srinivasa Reddy says Indiramma housing is their priority: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త

కేంద్రం సాయం..

రాష్ట్ర ప్ర‌భుత్వం పేద‌ల ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి వీలైనంత‌వ‌ర‌కు స‌హాయాన్ని అందించాల‌ని రెవెన్యూ, హౌసింగ్ , స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు.

- Advertisement -

రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర ప్ర‌భుత్వ గృహ నిర్మాణ, ప‌ట్ట‌ణాభివృద్ది వ్య‌వ‌హారాల శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ, కుల‌దీప్ నారాయ‌ణ్ స‌చివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డితో మ‌ర్యాద‌పూర్వ‌కంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో పేద‌ల‌ ఇళ్ళ నిర్మాణాల‌ను గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల‌, ఎంతో మంది నిరుపేద‌లు ఇందిర‌మ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారంద‌రికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని ఈ ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల ప్ర‌కార‌మే కేంద్ర ప్ర‌భుత్వ ఆలోచ‌న‌లు ఉన్నాయి కాబ‌ట్టి, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ప్రాధ్యాన్న‌త‌ల‌ను గుర్తించి అవ‌స‌రం మేర‌కు రాష్ట్రానికి ఇళ్ల‌ను మంజూరు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ స‌మావేశంలో హౌసింగ్ కార్య‌ద‌ర్శి జ్యోతి బుద్ధ ప్ర‌కాష్‌, ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వి.పి. గౌత‌మ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News