Sunday, October 6, 2024
HomeతెలంగాణMLA Madan Reddy: పుష్కలంగా వర్షాలు, బంగారు పంటలు

MLA Madan Reddy: పుష్కలంగా వర్షాలు, బంగారు పంటలు

రాష్ట్రంలో నీటి సమస్యే లేదన్న ఎమ్మెల్యే

కొల్చారం మండల కేంద్రంలోని కోతుల చెరువు అలుగు వద్ద గంగమ్మకు గ్రామ సర్పంచ్ కరెంట్ ఉమాదేవి రాజా గౌడ్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ 14 సంవత్సరాల పోరాటం చేసి సాధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ యజ్ఞం చేసిన నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని చెరువులు, ప్రాజెక్టులు నిండాయని అన్నారు. యావత్ భారతదేశంలో తెలంగాణలో పుష్కలంగా పంటలు పండుతున్నాయన్నారు. రైతులంతా ఆనందంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే వెంట మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌర్శంకర్ గుప్తా, ఉప సర్పంచ్ నింగుల్ల చెన్నయ్య, సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్, బి ఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎండుగుల కృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు దుర్గ ప్రసాద్ గౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్, నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ గౌడ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఖదీర్, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాజా గౌడ్, ఏడుపాయల మాజీ డైరెక్టర్ నంగునూరు గౌరీ శంకర్ గుప్తా, మాజీ అధ్యక్షుడు నేరెళ్ల చంటయ్య, మత్స్య సంఘం సభ్యులు దొంకెన మల్లయ్య, పాండ్ర వెంకటేశం, కారోబార్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News