Saturday, October 5, 2024
HomeతెలంగాణMLA Shankar Nayak: అర్హులకు ఆర్థికసాయం చెక్కులు

MLA Shankar Nayak: అర్హులకు ఆర్థికసాయం చెక్కులు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ మండలం & టౌన్ కి చెందిన 23 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ & షాది ముబారక్ చెక్కులను, 20 మంది లబ్ధిదారులకు (3,86,000) సి.ఎం.రిలీఫ్ ఫండ్ చెక్కులను మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి మేలు జరగాలనే సంకల్పంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్యమంత్రి సహయ నిధి పథకంతో కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందుతోందని అన్నారు.

- Advertisement -


ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లి భారం తగ్గిందని, ఆడపిల్లల తల్లితండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశ్యంతో సి.ఎం. కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని, పనిచేసే ప్రభుత్వం వెనుక ప్రజలు ఉండి ఆశీర్వదించాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, గద్దె రవి, మర్నేని వెంకన్న, ఎం.డి.ఖాసీం, తేళ్ల శ్రీను, గోగుల రాజు, నాయిని రంజిత్,రాజశేఖర్, చిట్యాల జనార్దన్, సూదగని మురళి, రఘు,బాలు, భారాస నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News