Sunday, November 16, 2025
HomeతెలంగాణMoinabad: ఎమ్మెల్సీ వాణిదేవి ఆధ్వర్యంలో హరితహారం

Moinabad: ఎమ్మెల్సీ వాణిదేవి ఆధ్వర్యంలో హరితహారం

మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామ పరిధిలో ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఔషధ వనంలో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్తీక్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి ఔషధ వనంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవం రోజున హరితహారం లాంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు ఒక మొక్కను తప్పక నాటాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి నక్షత్రం జయవంత్, జెడ్పిటీసీ కాలే శ్రీకాంత్, మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వప్న, తోల్కట్ట గ్రామ సర్పంచ్, రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు కనకమామిడి శ్రీనివాస్, తోల్కట్ట ఎంపీటీసీ ఎం. రవీందర్ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు జయవంత్, రావుఫ్ భాయ్, పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad