Wednesday, September 18, 2024
HomeతెలంగాణNagarkurnool: రేవంత్ భారీ బహిరంగకు తరలిన తలకొండపల్లి కాంగ్రెస్ శ్రేణులు

Nagarkurnool: రేవంత్ భారీ బహిరంగకు తరలిన తలకొండపల్లి కాంగ్రెస్ శ్రేణులు

డోకూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ..

నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మల్లురవి మూడో విడత నామినేషన్ దాఖలాలు చేశారు. అనంతరం మల్లు రవికి మద్దతుగా బిజినపల్లిలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఈ భారీ బహిరంగ సభకు తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మండలం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ర్యాలీగా తరలి వెళ్లారు. మండల పరిధిలోని సంగాయిపల్లి గేట్ వద్ద ప్రారంభం అయినా ర్యాలీని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందనీ, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సబ్బండ వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని ఆయన తెలియజేశారు. నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకోవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు దేశ వ్యాప్తంగా సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు. బహిరంగ సభకు తరలిన వారిలో తలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎమిరెడ్డి భగవాన్ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ కార్యదర్శి మోహన్ రెడ్డి, మాజీ ఎంపిపి లక్ష్మీదేవి రఘురాములు, కిసాన్ సెల్ మండల కార్యదర్శి విష్ణు గౌడ్, పడకల్ ఎంపిటీసి జోగు రమేష్‌, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి డిగ్రీ కృష్ణ, మాజీ ఎంపీటీసీలు వెంకటయ్య, రాములు, దాసరి యాదయ్య, తలకొండపల్లి గ్రామ అధ్యక్షుడు రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, శ్రీనివాస మూర్తి, డేవిడ్, హరిమోహన్ రెడ్డి, గోడిగే వెంకటయ్య, నరేష్, వేంకటేశ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News