Friday, April 11, 2025
HomeతెలంగాణNagendar Yadav: చిరు వ్యాపారులకు గొడుగులు

Nagendar Yadav: చిరు వ్యాపారులకు గొడుగులు

ఎండలోనే వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు చిరు సాయం చేసిన కార్పొరేటర్

శేరిలింగంపల్లి డివిజన్ లోని చిరు వ్యాపారులకు చేవెళ్ల ఎంపి డా. జి.రంజిత్ రెడ్డి సహకారంతో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గొడుగుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న పట్టించుకోకుండా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు ఏదో ఒక సాయం చేయాలనే గొప్ప ఉద్దేశంతో ఎంపి రంజిత్ రెడ్డి గారు గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారని అన్నారు.

- Advertisement -

వారికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు కార్పొరేటర్. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్, బస్వరాజ్, రవి యాదవ్, రవీంద్ర రాథోడ్, ఎంపి అజర్, రాజేష్ గూడూరు, అజీమ్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News