నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పోలీసుల గౌరవ వందనాలు స్వీకరించి, జిల్లా అదనపు కలెక్టర్లు బి.రాహుల్, ప్రభావత్ మోతిలాల్, అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగం రూపకర్త డా.బిఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/9b75a6d9-43a5-481d-a221-0b4305ae6fb6-1024x681.jpg)
అనంతరం పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/c5c05a30-7cc9-4cba-9b47-e29552aa95a5-1024x681.jpg)