Friday, September 20, 2024
HomeతెలంగాణNanpur: వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Nanpur: వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సీతారాం పల్లి, విలేజ్ నస్పూర్ లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని. రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన రైతు కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సందేల వెంకటేష్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, నస్పూర్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News