Thursday, September 19, 2024
HomeతెలంగాణNayani Rajender Reddy: భూములు కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా

Nayani Rajender Reddy: భూములు కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా

భద్రకాళి అమ్మవారి వద్ద కుటుంబ సభ్యులతో ప్రమాణం చేస్తా

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ తనపై ఆరోపించిన విధంగా భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి వైదొలుగుతానని, శనివారం ఉదయం 8 గంటలకు భద్రకాళి అమ్మవారి సాక్షిగా కుటుంబ సభ్యులతో ప్రమాణం చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. హనుమకొండలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దమ్ముంటే వినయ్ భాస్కర్ కూడా తన కుటుంబ సభ్యులతో వచ్చి తనపై వచ్చిన ఆరోపణలు నిజమే అని ఒప్పుకుంటూ భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రమాణం చేయాలని అన్నారు. లేదంటే తను కూడా రాజకీయాల నుండి వైదొలుగుతానని చెప్పాలని అన్నారు.
37 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటిసారి తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసేటందుకు అవకాశం రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏనాడు ఒక్క తప్పు చేయలేదని, అవకాశం వస్తుందంటే ఒక్కొక్కరి నిజస్వరూపాలు బయటపడుతున్నాయని మండిపడ్డారు. రాజకీయాల మీద విరక్తి చెందేలా కుట్రలు చేస్తున్నారని, వినయ్ భాస్కర్ ఎన్ని కేసులు మోపిన నిలదొక్కుకున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేందర్ రెడ్డి ఇతర పార్టీలకు అమ్ముడు పోతాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని భగ్గుమన్నారు.
డబ్బులు తీసుకున్నట్లు, ఇతర పార్టీలకు అమ్ముడుపోయానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని, నువ్వు మగాడివి అయితే నిరూపించు.. లేకుంటే నువ్వు ఎన్ని కబ్జాలు చేసావో నేను నిరూపిస్తానని సవాల్ చేశారు. తనపై మర్డర్ కేసు పెట్టి తనను, తన కుటుంబాన్ని రెండు నెలలు చాలా ఇబ్బందులకు గురిచేసాడని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ 2014 లోనే చెడ్డి గ్యాంగ్ తరహాలో రాష్ట్రానికి వచ్చారని ఎద్దేవా చేశారు. తనకు టికెట్ రావటంపై కొంతమంది దుర్మార్గులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, మళ్లీ అమ్ముడు పోతాడు అంటూ సెల్ ఫోన్ లో తమ వాళ్లే కొంతమంది సందేశాలు పంపిస్తున్నారని బాధపడ్డారు. బిఆర్ఎస్ వాళ్లు పేదవాళ్లు నివసించే స్లం ఏరియాలను ఎంచుకొని ఓటుకు2, 3 వేలు పంచి గెలుద్దాం అనుకుంటున్నారని అనుమానం వ్యక్తపరిచారు. మధ్యతరగతి వారు, మేధావులు కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచాలని కోరారు. కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జా చేశానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానాని అన్నారు. రాఘవరెడ్డి 30 సంవత్సరాల నుంచి తనకు పరిచయం అని, రెండు చేతులు జోడించి ఎన్నికలలో తనకు సహకరించమని కోరుతానన్నారు.

- Advertisement -

సమావేశంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, టిపీసీసి ఎస్.సి డిపార్ట్మెంట్ కో ఆర్ది నేటర్ ఎం.పి.ఆనంద్, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజుల్లా బేగ్, కూర వెంకట్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎస్.సి. డిపార్ట్మెంట్ డాక్టర్ పి. రామకృష్ణ, జిల్లా ఓబిసి డిపార్ట్మెంట్ చైర్మన్ బొమ్మతి విక్రమ్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షుడు పల్లకొండ సతీష్, జిల్లా డాక్టర్ర సెల్ల్ అధ్యక్షుడు డాక్టర్ శ్రవణ్,క మరున్నీసా బేగం, పులి రాజు, బొంత సారంగం, ఎర్ర మహేందర్,ఇప్ప శ్రీకాంత్,నాయిని లక్ష్మా రెడ్డి, తౌటిరెడ్డి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బంక సంపత్ యాదవ్, అంబెడ్కర్ రాజు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News