Thursday, September 19, 2024
HomeతెలంగాణNelakondapalli: ఇంటింటికి ప్రచారంలో కందాళ

Nelakondapalli: ఇంటింటికి ప్రచారంలో కందాళ

జోరుగా సాగుతున్న చంద్రావతి ప్రచారం

మండల పరిధిలోని మంగాపురం తండాలో బి ఆర్ ఎస్ పార్టీ పాలేరు నియోజక వర్గ అభ్యర్థి కంధాళ ఉపేందర్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఇంటింటికి ప్రచారం చేశారు. చంద్రావతి మాట్లాడుతూ మూడోసారి ముఖ్య మంత్రి అయ్యేది కె సి ఆర్ అని, దానిని ఆపడం ఎవరి వల్ల కాదు అని అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ, మానిఫెస్టోలో పొందుపరిచిన పథకాలపై అవగాహన కలగజేశారు. గత ప్రభుత్వాల పాలనలో కరెంట్ ఉండేది కాదని, కాని తెలంగాణ వచ్చిన తరువాత కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు 24 గంటల కరెంట్ అందుతుందని అన్నారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం దేశం లో ఒక్క తెలంగాణ మాత్రమే అని పేర్కన్నారు. మీరంతా స్థానికుడైన కందాళని భారి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య సుధాకర్, బి ఆర్ ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News