Thursday, September 19, 2024
HomeతెలంగాణNirmal: గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి

Nirmal: గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి

నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించిన..

నిర్మల్ లో వినాయక నిమజ్జన శోభాయాత్ర ను ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. బుధవార్ పేట్ గణనాథులకు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు ముప్పిడి రవి ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక పూజలు చేసారు.

- Advertisement -

అనంతరం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శోభాయాత్రను ప్రారంభించారు. గణనాథుని వద్ద సంతోషంగా నృత్యం చేశారు. నిమజ్జనాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని, మండపాల నిర్వాహకులు, భక్తులు పోలీస్ వారికి ,ఉత్సవ కమిటీకి సహకరించాలని కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు, భక్తులు, గణేష్ మండపాల నిర్వాహకులు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News