Thursday, September 19, 2024
HomeతెలంగాణNizamabad: చందూర్ ప్రమాద బాధితులకు వేముల పరామర్శ

Nizamabad: చందూర్ ప్రమాద బాధితులకు వేముల పరామర్శ

బడాపహాడ్ దర్గాకు వెళ్తూ ప్రమాదానికి గురై నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాల్కొండ నియోజకవర్గం మానాలా వాసులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న ప్రతి బెడ్ తిరుగుతూ బాధితులకు మంత్రి మనో ధైర్యం చెప్పారు. మీకు ఏమి కానివ్వం,అన్ని విధాల అండగా ఉంటానని భరోసా కల్పించారు. మేజర్ ఇంజూరి అయిన వారి చికిత్స రిపోర్ట్స్ తనకు పర్సనల్ గా పంపాలని వైద్యులకు సూచించారు. అనంతరం అక్కడకు వచ్చిన మీడియాతో మంత్రి మాట్లాడుతూ…బాల్కొండ నియోజవర్గం మానాల గ్రామానికి చెందిన సుమారు 50 మంది బడా పహాడ్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న డిసిఎం దురదృష్టవశాత్తు బోల్తాపడి ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వ యంత్రాగం సకాలంలో అప్రమత్తం అయిందన్నారు. లోకల్ పోలీస్ వారు అంబులెన్స్ వచ్చే ఏర్పాట్లు చేయడంతో పాటు అర్థరాత్రి సమయంలో వచ్చిన క్షత గాత్రులకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించారని అన్నారు. ఎక్కడా ఆలస్యం లేకుండా పోలీసులు,వైద్యులు ఎంతో బాధ్యతాయుతంగా మెదిలారని వారికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

ప్రమాదంలో 15 మందికి అత్యంత స్వల్పంగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయని, మరో నలుగురికి ఫ్యాక్చర్స్ అయ్యాయని మంత్రి మీడియాకి వెల్లడించారు. ఫ్యాక్చర్ అయిన వారికి సర్జరీ చేసే అవకాశం ఉన్నదని చెప్పారు. స్వల్ప గాయాలై కోలుకున్న 15 నుంచి 20 మందిని ఇవాళ,మరో 6 గురిని రేపు డిశ్చార్జ్ చేస్తామన్నారు. మిగతా బాధితులు కూడా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. డిశ్చార్జి అయిన వారిని వాళ్ల ఇండ్లకు క్షేమంగా చేర్చే బాధ్యత తమదే అని,సొంత ఖర్చులతో రవాణా సదుపాయం ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. మంత్రి వెంట డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆసుపత్రి వైద్యులు, పోలీసు, ఇతర అధికారులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News