Thursday, September 19, 2024
HomeతెలంగాణNTR Satha Jayanthi: ఎన్టీఆర్ కు రాజకీయ, పరిపాలనా వారసుడు కేసీఆరే: ఎర్రబెల్లి

NTR Satha Jayanthi: ఎన్టీఆర్ కు రాజకీయ, పరిపాలనా వారసుడు కేసీఆరే: ఎర్రబెల్లి

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హనుమకొండలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అంటూ పుష్పాంజలి ఘటించారు ఎర్రబెల్లి. NTR పేదల పెన్నిధని, రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారని, ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచిన నేతగా ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమన్నారు మంత్రి. NTRకి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆరేనన్న ఎర్రబెల్లి వారి ఆశయాలను సీఎం కెసిఆర్ పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకీ మనమిచ్చే ఘనమైన నివాళంటూ ఎర్రబెల్లి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News