Sunday, July 7, 2024
HomeతెలంగాణPadayatra: కాంగ్రెస్ అసెంబ్లీకి..బీఆర్ఎస్ ఇంటికి- పొన్నం ప్రభాకర్

Padayatra: కాంగ్రెస్ అసెంబ్లీకి..బీఆర్ఎస్ ఇంటికి- పొన్నం ప్రభాకర్

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అసెంబ్లీకి..బీఆర్ఎస్ ఇంటికి పోవటం ఖాయమని జోస్యం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. నిఖార్సైన కాంగ్రెస్ వాళ్లు బీ.ఆర్.ఎస్ బందిపోట్లతో కలవలేరని కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

- Advertisement -

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి చేపడుతున్న “హాథ్ సే హాథ్ జోడో యాత్ర” పాలకుర్తి నియోజకవర్గంలో సాగుతోంది. ఈ యాత్రలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ , కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ , జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి , చొప్పదండి నియోజకవర్గ ఇంఛార్జ్ మేడిపల్లి సత్యంతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News