Sunday, November 16, 2025
HomeతెలంగాణPailla: 108 అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Pailla: 108 అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ప్రారంభించిన అంబులెన్స్ ను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రాంత ప్రజలకు 24 గంటలు 108 సేవలు అందుబాటులో ఉంటాయి అని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజ్ ,సింగిల్ విండో చైర్మన్ వెంకట్ రెడ్డి , మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్, స్థానిక ఎంపీటీసీ పల్సం రమేష్, కుందారపు యశోద కొమరయ్య, పల్లెర్ల భాగ్యమ్మ రాజు, మండల ప్రధాన కార్యదర్శి మామిళ్ళ రత్నయ్య పట్టణ అధ్యక్షుడు ఎమ్మే లింగస్వామి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad