Friday, September 20, 2024
HomeతెలంగాణPailla: అభివృద్ధి, సంక్షేమాలే బిఆర్ఎస్ బలం

Pailla: అభివృద్ధి, సంక్షేమాలే బిఆర్ఎస్ బలం

మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమేనంటున్న ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ భువనగిరి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ 1వ వార్డ్ ముక్తాపూర్ నుండి 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో ‌ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో రెండు దశాబ్దాల పాటు కొనసాగుతున్నా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై రైతులకు వ్యతిరేకంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు కలత చెంది, రైతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధిని గమనించి.. నిజమైన రైతు బాంధవుడు కేసీఆరే అని గుర్తించామన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నామని అన్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ పార్టీకి ప్రధాన బలం అని తెలంగాణలో మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మడుగుల ప్రభాకర్ రెడ్డి, జడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి,మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ కందడి భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ కొంగరి కృష్ణ, ముక్తాపూర్ మాజీ సర్పంచ్ మనుకుంట్ల బాలచందర్ గౌడ్, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News