Thursday, September 19, 2024
HomeతెలంగాణPalabhishekam: మెట్రో పొడగింపుపై కేసీఆర్ చిత్రానికి పాలాభిషేకం

Palabhishekam: మెట్రో పొడగింపుపై కేసీఆర్ చిత్రానికి పాలాభిషేకం

హయత్ నగర్ వరకు మెట్రో పొడగించే నిర్ణయంపై హర్షం

ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఎల్బి నగర్ చౌరస్తా నుండి హయత్ నగర వరకు మెట్రో విస్తరణకు అంగీకరించి రానున్న నూతన ప్రభుత్వం తోలి క్యాబినెట్ మీటింగులో తొలి సంతకం చేస్తానని ప్రకటించడంతో హర్షం వ్యక్తపరుస్తూ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో బిఎన్ రెడ్డి నగర్ ఆటోస్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు కేసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంపై ఇంత ప్రేమను పంచుతున్న కేసిఆర్ కి ఎల్బీ నగర్ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలూ శ్రమించి దేశంలోనే ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో అభివృద్ధి పనులపై ఇంత ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మనందరి అభిమాన నాయకులు, మన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరరెడ్డి కి ఎల్బీనగర్ వాసులందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చేసిన మేలును మరువకుండా అందరం ఒకతాటిపై నిలబడి మొదటిసారిగా ఈ నియోజకవర్గం నేలపై అత్యధిక మెజారిటీతో గులాబీ జెండాను ఎగరవేసి కేసిఆర్ కి కానుకగా ఇస్తాం అని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరక్టర్ అనిల్ చౌదరి, కొంగర మహేష్, జనరల్ సెక్రటరీ మువ్వ సతీష్ చౌదరి స్థానికి టీఆర్ఎస్ అభిమానులంతా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News