Saturday, October 5, 2024
HomeతెలంగాణHyd: అమరవీరులకు పాలాభిషేకం చేసిన యూత్ కాంగ్రెస్

Hyd: అమరవీరులకు పాలాభిషేకం చేసిన యూత్ కాంగ్రెస్

రాష్ట్రంలో కొలువుల జాతర

తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఆధ్వర్యంలో గన్ పార్క్ అమరవీరుల విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణలో కొలువుల జాతర సాగుతోందని, 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలపై యూత్ కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసిింది. నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం..అమరవీరుల ఆశయ సాధన దిశగా సాగుతోందన్నారు.

- Advertisement -

ఇంటికో ఉద్యోగం ఇస్తాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్న యూత్ కాంగ్రెస్ లీడర్లు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో విడుదలైన డీఎస్సీ ఈరోజు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జూన్ 2న నోటిఫికేషన్ విడుదల చేస్తాం తెలంగాణలో కొలువుల జాతర చేస్తామని వారు ధీమా వ్యక్తంచేశారు. మా ప్రభుత్వం వచ్చిన రెండు నెలలో 37 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని, బీఆర్ఎస్ ల కేంద్రంలో బిజెపి ఓడిపోవడం ఖాయమన్నారు.

ఏడదికి 2కోట్ల ఉద్యగాలు ఇస్తాం అని మోసం చేసింది మోడీనే అంటూ మోడీ ప్రైవేట్ పరం చేసిన ప్రభుత్వ రంగ సమస్థలను మళ్లీ ప్రభుత్వ పరం చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News