Friday, April 11, 2025
HomeతెలంగాణPalakurthi: ప్లీనరీ స్థలం పరిశీలించిన ఎర్రబెల్లి

Palakurthi: ప్లీనరీ స్థలం పరిశీలించిన ఎర్రబెల్లి

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకొని ఈ నెల 25న పాలకుర్తిలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి ప్లీనరీ కోసం సభా స్థలాన్ని పరిశీలించారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తిలోని బృందావన్ గార్డెన్స్ సమీపంలోని స్థలాన్ని మంత్రి స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు నాయకులతో కలిసి చూశారు. ఆరోజు వచ్చే పార్టీ శ్రేణులకు అవసరమైన సీటింగ్, సభా వేదిక తదితర అంశాలకు సరిపోయే విధంగా స్థలం ఉండాలని ఆయన అన్నారు. ఈ స్థలంతో పాటు అవసరమైతే, మరో స్థలాన్ని కూడా పరిశీలించాలని నేతలకు మంత్రి సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News