Sunday, July 7, 2024
HomeతెలంగాణPalakurthi: సోమేశ్వర లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎర్రబెల్లి

Palakurthi: సోమేశ్వర లక్ష్మీ నరసింహుడికి ప్రత్యేక పూజలు చేసిన ఎర్రబెల్లి

మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం, స్వయంభు శ్రీశ్రీశ్రీ పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీ నరసింహ ఆలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సతీమణి ఎర్రబెల్లి ట్రస్ట్ ఛైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు దంపతులు, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి దంపతులు మహాభిషేకం నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వారిని దేవాలయంలోకి తోడ్కొని వెళ్ళి, పవిత్రమైన ఈ రోజు మహాభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారికి వేదా శీర్వచనం అందించారు. శాలువాతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News