Sunday, October 6, 2024
HomeతెలంగాణPalla campaign: పల్ల తొలి రోజు ప్రచారం జననీరాజనం

Palla campaign: పల్ల తొలి రోజు ప్రచారం జననీరాజనం

నన్ను ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

నన్ను ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తానని జనగామ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని చేర్యాల మండలంలోని వెచరేని గ్రామంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో మహిళలు హారతిచ్చి బతుకమ్మలు, బోనాలు డప్పు చప్పులతో పూల వర్షం కురిపిస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఇంటింటికీ తిరుగుతూ అవ్వ, అక్కల ఆశీర్వచనం తీసుకొని ప్రచారం చేశారు.సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు.

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో అద్భుత మైన ప్రగతి సాధించిందన్నారు. బీఆర్ఎస్ ను నమ్మి పార్టీలో చేరిన వారికి అన్నివిధాలా అండగా ఉంటామని, నాయకులకు కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.అందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ పటిష్టత కోసం పనిచేస్తూ ప్రాంత అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలన్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.60 ఏండ్లలో చేపట్టని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.ప్రజలంతా పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలిచి సీఎంగా కేసీఆర్ ను మరోసారి ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గ్రామ గ్రామాన బిజెపి కాంగ్రెస్ పార్టీల నుండి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని, అభివృద్ధిని చేసి చూపిస్తానని ఓటర్లే తన దేవుళ్లని, తాను పూజారిగా సేవలు చేసుకుంటానని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News