Sunday, October 6, 2024
HomeతెలంగాణMallapur: కొత్త ధాంరాజ్ పల్లి పంచాయతీ పాలకవర్గానికి సన్మానం

Mallapur: కొత్త ధాంరాజ్ పల్లి పంచాయతీ పాలకవర్గానికి సన్మానం

అధికారంలో ఉన్నా లేకున్నా గ్రామాభివృద్ధి చేసుకుందాం

పంచాయతీ పాలక వర్గాల పదవికాలం ముగిసింది. ఐదు ఏళ్ళు కలిసి గ్రామ అభివృద్ధి లో భాగస్వామ్యం అయిన ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, కార్యదర్శి, పంచాయతీ కార్మికులను కొత్త ధాంరాజ్ పల్లి తాజా మాజీ సర్పంచ్ బద్దం సరిత కమలాకర్ రెడ్డి ఘనంగా సత్కరించారు.శాలువా సన్మానించి, మెమెంటో అందజేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ సరిత మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సహకరించిన గ్రామ ప్రజలకు, పంచాయతీ పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. పదవిలో ఉన్నా లేకున్నా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరం తోడ్పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాటిపల్లి సరోజన ఆదిరెడ్డి, ఉప సర్పంచ్ బట్టు లత గంగాధర్, కార్యదర్శి సాయి కృష్ణ, వార్డ్ సభ్యులు నారాయణ, రాజేందర్, బీజేపీ నాయకులు గడ్డం నవీన్ రెడ్డి,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఏఎన్ఎం సుశీల, అంగన్వాడీ, ఆశా, వీవోఏ, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News