Monday, April 7, 2025
HomeతెలంగాణPatancheru: శ్రీకాకుళం సంక్షేమ సంఘ భవన శంకుస్థాపన

Patancheru: శ్రీకాకుళం సంక్షేమ సంఘ భవన శంకుస్థాపన

కులం, మతం, వర్గం, ప్రాంతం తేడా లేకుండా నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో సొంత నిధులతో కొనుగోలు చేసిన 450 చదరపు గజాలలో నిర్మించ తలపెట్టిన శ్రీకాకుళం సంక్షేమ సంఘం సామాజిక భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు శ్రీకాకుళం జిల్లా వాసులకు 450 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి అందించినట్టు తెలిపారు. ఇందులో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News