Thursday, September 19, 2024
HomeతెలంగాణPatancheru: వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టలో తలసాని

Patancheru: వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్టలో తలసాని

పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రితో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News