Sunday, July 7, 2024
HomeతెలంగాణPatancheru: మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Patancheru: మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండల పరిధిలోని పాటి గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ ముఖద్వారంలో నిర్మించిన స్వాగతం తోరణాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. యాదవ సంఘం నాయకులు గొర్రె పిల్ల, గొంగడి కప్పి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
నూతన దేవాలయాలతో పాటు పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు తన వంతు సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News