Thursday, July 4, 2024
HomeతెలంగాణPonnam tax: రేవంత్-పొన్నం టాక్స్: పాడి కౌశిక్

Ponnam tax: రేవంత్-పొన్నం టాక్స్: పాడి కౌశిక్

ఎన్టీపీసీలో ఫ్లై యాష్ కుంభకోణం సాగుతోందని బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ ఆరోపించారు. అసలు మొత్తం వ్యవహారంపై ఎన్టీపీసీ ఎందుకు సైలెంట్ గా ఉందని పాడి కౌశిక్ ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి ,కె .పి .వివేకానంద, డాక్టర్ కె .సంజయ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

రామగుండం ఎన్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ తరలింపులో మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని, ఓ లారీలో 32 టన్నులు ఫ్లై యాష్ తరలించాల్సి ఉంటే 72 టన్నులు తరలిస్తున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. వే బిల్లుల్లో ఎన్ని టన్నులని పేర్కొనడం లేదని, అదనంగా రోజూ తరలిస్తున్న ఫ్లై యాష్ కు 50 లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారన్నారు. ఈ డబ్బులు పొన్నం ప్రభాకర్ అన్న కుమారుడు అనూప్ వసూల్ చేస్తున్నారని, ఓవర్ లోడ్ తో వెళ్తున్న 13 లారీ లను నేనే స్వయంగా పట్టుకున్నానని ఆయన వెల్లడించారు.

కేవలం రెండు లారీలను సీజ్ చేసి రవాణా శాఖ అధికారులు చేతులు దులుపుకుంటున్నారని, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఒత్తిళ్లకు రవాణా శాఖ అధికారులు లొంగుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. అధికారులు తమ భాద్యతలు తాము నిర్వర్తించాలని, నేను లారీలు పట్టుకుంటున్నా అని హుస్నాబాద్ మీదుగా తరలిస్తున్నారని, పొన్నం ఎక్కడ్నుంచి తరలించినా బీ ఆర్ ఎస్ కార్యకర్తలు పట్టుకుంటారని ఆయన హెచ్చరించారు. ఫ్లై యాష్ లారీలతో రోడ్డు ప్రమాదాలు కూడా జరగుతున్నాయని, ఇంజనీరింగ్ విద్యార్ధి అఖిల్ ను ఫ్లై యాష్ లారి బలి తీసుకుందన్నారు. అఖిల్ మరణంతోనే నాకు ఫ్లై యాష్ ఓవర్ లోడ్ లారీ ల గురించి తెలిసిందన్న కౌశిక్..అఖిల్ మరణం మంత్రి పొన్నంకు శాపంలా తగలడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీపీసీ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారు ? తరలిస్తున్న ఫ్లై యాష్ వివరాలను ఎన్టీపీసీ ఎందుకు దాస్తోంది? ఫ్లై యాష్ ఓవర్ లోడ్ దందా ఆపకపోతే మా పార్టీ ఎమ్మెల్యేల బృందం రామగుండం ఎన్టీపీసీను సందర్శిస్తుందన్నారు.

నేను ఆధారాలతో ఆరోపణలు చేస్తుంటే పొన్నం నా దిష్టి బొమ్మలు దహనం చేపిస్తున్నారని, పేదల శవాలపై పొన్నం పేలాలు ఏరుకుంటున్నారని, మూడు నాలుగు రోజుల్లో ఓవర్ లోడ్ లారీల దందా ఆపకపోతే మా కేడర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందని కౌశిక్ హెచ్చరించారు. అధికారులు కాంగ్రెస్ ఒత్తిళ్లకు లొంగకుండా నిబంధనలకు అనుగుణంగా పని చేయాలని, తప్పు చేస్తున్న అధికారుల వివరాలను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నామన్నారు. కరీంనగర్ రేవంత్-పొన్నం టాక్స్ అమలవుతున్నట్లు మాకు అనుమానాలు ఉన్నాయన్నారు ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News