Sunday, July 7, 2024
HomeతెలంగాణPrakash Goud: నార్సింగి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే

Prakash Goud: నార్సింగి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే

ఆర్టీసీ ఉద్యోగుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

నార్సింగి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో రూపాయలు 6.14 కోట్ల లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు, వార్డు నెంబర్ 16 లో 20 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్, వార్డు నెంబర్ 7 లో రూ. 20 లక్షలతో, ముదిరాజ్ కమ్యూనిటీ హాలువార్డు నెంబర్ 16 లో సిసి. డ్రెయిన్ పనులు వార్డు నెంబర్ 7 లో సీసీ అండ్ డ్రైవ్ వార్డు నెంబర్ 8 లో సీసీ మరియు డ్రెయిన్ పనులు 17వార్డ్ నెంబర్, వార్డ్ నెంబర్ 18 సిసి రోడ్లు, డ్రైనేజీ వివిధ పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో వారి వెంట చైర్మన్ రేఖా యాదగిరి వైస్ చైర్మన్ వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్లు శివారెడ్డి ప్రవీణ్, శ్రీకాంత్,ఎక్స్ సర్పంచ్ నరసింహ మున్సిపల్ కమిషనర్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అంతకు ముందు రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి కృతజ్ఞతతో రాజేంద్రనగర్ ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఆర్టీసీ ఉద్యోగులచే పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిది అని, తమ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం ఫలితంగా ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News