Sunday, October 6, 2024
HomeతెలంగాణPuvvada: ఆధ్మాత్మికతతోనే జీవిత పరమార్థం

Puvvada: ఆధ్మాత్మికతతోనే జీవిత పరమార్థం

సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు చర్యలు

మనిషి తనలోకి తాను పయనించడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆధ్మాత్మికతను మించిన మరో మార్గం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఖమ్మం స్తంబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం రోటరీ నగర్ లోని గుడ్ షెఫడ్ చర్చ్, తుమ్మలగడ్డలోని మజీద్- ఏ-అస్టాబల్ లో ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు.

- Advertisement -


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆది నుండి అన్ని మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ, లౌకిక స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నదని, ‘భిన్నత్వంలో ఏకత్వమే’ ఈ దేశానికి బలం అని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ దిశగా అన్ని మతాల భక్తి, ఆధ్యాత్మిక క్షేత్రాల పురోగతికి చేయూతనిస్తున్నారు. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ‘గంగా జమునా తెహజీబ్’ వర్ధిల్లుతున్నదన్నారు. భిన్న మతాల భక్తి, ఆధ్యాత్మిక రంగాల వైభవానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్యాచరణ, వేదహిత-వేద పాఠశాల సాంప్రదాయ విద్యకు ఆదరణ, గౌరవం కరువవుతున్న నేపథ్యంలో తెలంగాణలోని వేద పాఠశాలలకు ఆలంబనగా రూ. 2 లక్షలు ఆర్ధిక సహాయం అందించే పథకం ద్వారా అందిస్తున్నరన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణకు నెలకు రూ. 2,500 చొప్పున 1805 దేవాలయాలకు చెల్లించేవారని, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1840 దేవాలయాలకు ఈపథకాన్ని వర్తింపచేయడంతో మే 2023 నాటికి ఈ పథకం కింద లబ్ది పొందే దేవాలయాల సంఖ్య 3,645 కు చేరిందన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 లక్షలను మంజూరు చేసిందని, అపర కర్మ భవనం, మధిర పట్టణంలో బ్రాహ్మణ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 73 లక్షలు మంజూరు చేసిందని వివరించారు. దేశమే అబ్బుర పడే యాదాద్రి దేవాలయంను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు ప్రతిరూపంగా వాస్తు శిల్పులు, స్థపతులు, ఆధ్యాత్మికతకు అద్దంపట్టేలా రాతి దేవాలయ నిర్మాణాన్ని చేశారని, వైష్ణవ సాంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా ద్రవిడ వాస్తుశైలికి జీవం పోసిన కాకతీయ, పల్లవ, హోయసాల, చాళుక్య శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం రూపుదిద్దుకుందన్నారు. జిల్లాలో 2014 లో 115 డేవాలయాల్లో ధూప, దీప నైవేద్య పధకం అమలులో ఉండగా, నేడు 238 దేవాలయాల్లో అమలవుతుందన్నారు. క్రొత్తగా మరో 67 దేవాలయాలకు ఈ పథకం మంజూరు కాగా, అట్టి ఉత్తర్వులు సంబంధిత అర్చకులకు అందజేశారు. స్తంభాద్రి ఆలయ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ని రూ. 10 నుండి 15 కోట్లు మంజూరు కోరినట్లు ఆయన తెలిపారు.

అధికారికంగా క్రిస్మస్ పండుగ, అధికారికంగా రంజాన్ వేడుకలు, తోఫాలు ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, గత 20 రోజులుగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. రోజు ఒక విభాగంలో గత 9 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, అభివృద్ధి ని ప్రజలకు వివరిస్తూ, ఇదే ఒరవడిని కొనసాగించి ఇంకా అభివృద్ధి చెందేలా పునరంకింతం అయ్యేలా చైతన్యం కావాలని అన్నారు. రాష్ట్ర ప్రజల మంచి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన అన్నారు.


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా మైనార్టీ అధికారి మెహమూద్, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, బుర్రి వెంకట్ కుమార్, దండా జ్యోతి రెడ్డి, దాదే అమృతమ్మ సతీష్, మడురి ప్రసాద్, మక్బూల్, ఆలయ చైర్మన్ గోలి వెంకటేశ్వర్లు (చిన్నా), పాస్టర్ లు రెవ.జాన్ కాంతారావు, రెవ. బి. సత్యపాల్, జోజి, ఖమర్, షౌకత్ అలీ, మెహబూబ్ అలీ, ముఫ్తీ ఖలీక్, తాజ్ఉద్దీన్ ఎండీ గాయాజ్, షంశుద్దిన్, టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News