Sunday, July 7, 2024
HomeతెలంగాణRajasingh: గోషామహల్ లో రాజసింగ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం

Rajasingh: గోషామహల్ లో రాజసింగ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల కలకలం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు కనిపిస్తుండటం కలకలం సృష్టిస్తోంది. రాజాసింగ్ కు 1000 కోట్ల సవాల్ కు ప్రతి సవాల్ విసిరాడు BRS నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్..గోశామహల్ లోని కోఠి, అబిడ్స్, MJ మార్కెట్, CBS , జుమెరాత్ బజార్ ప్రధాన చౌరస్తా లలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశాడు. రాజసింగ్.. 1000 పొర్లు దండాలు పెట్టి.. 1000 కోట్లు పంచినా ఓట్లు వేయరని ఈ పోస్టర్స్ వెల్లడిస్తున్నాయి. రాజా సింగ్ 9 ఏళ్లలో గోశామహల్ నియోజకవర్గం లో ఏం అభివృద్ధి చేసారో చెప్పాలని.. హిందుత్వం, మతం పేరును అడ్డుపెట్టుకొని రాజా సింగ్ రాజకీయాలు చేస్తూన్నాడని పోస్టర్ల ద్వారా బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్ ఇచ్చి.. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. రాజకీయ పబ్బం గడుపుతున్నారన్న ఆరోపణలపై రాజా సింగ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. రాబోయే ఎన్నికల్లో గోశామహల్ ప్రజలు రాజసింగ్ ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని.. ప్రజల సమస్యల కోసం.. MLA రాజసింగ్ ఎన్నడూ అందుబాటులో ఉండడనే ఆరోపణలను రాజా సింగ్ ఎలా తిప్పుకొడతారన్న ఆసక్తి గోషామహల్ లో కనిపిస్తోంది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News