Thursday, September 19, 2024
HomeతెలంగాణRamadugu: బండి సంజయ్ కి టికెట్ కేటాయింపు- సంబరాలు

Ramadugu: బండి సంజయ్ కి టికెట్ కేటాయింపు- సంబరాలు

బండిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం

భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కి రెండవ సారి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అవకాశం వచ్చినందుకు రామడుగు మండల కేంద్రంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ కి మరోసారి అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్రమోడీకి, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి వర్యులు అమిత్ షాకి కృతజ్ఞతలు తెలిపారు. బండి సంజయ్ కుమార్ ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజార్టీతో గెలిపించి, జాతీయ నాయకత్వనికి బహుమతిగా ఇస్తామని తెలిపారు.

- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలువబోతున్నారని, కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరు అని, రాష్ట్రంలో బి. ఆర్ ఎస్ పని అయిపోయిందని ఆ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్ గౌడ్, ఉప్పు శ్రీనివాస్ పటేల్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్,యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవేల్లి రామ్,మండల ప్రధాన కార్యదర్శి ఎడవెళ్లి లక్ష్మన్, మండల ఉపాధ్యక్షుడు బండారి శ్రీనివాస్, మారుకొండ అనిల్, మాడిశెట్టి అనిల్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, పొన్నం మల్లయ్య, బూత్ కమిటీ అధ్యక్షులు పల్లపు చిరంజీవి, సింగసాని మల్లేశం, రాగం కనకయ్య, వేముల శ్రీనివాస్, మాదం ఎల్లయ్య, కడరి శ్రీనివాస్, మాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News