Thursday, September 19, 2024
HomeతెలంగాణRamadugu: గుండి గ్రామ పంచాయితీ ఆత్మీయ సన్మాన సభ

Ramadugu: గుండి గ్రామ పంచాయితీ ఆత్మీయ సన్మాన సభ

5 ఏళ్లపాటు సేవలు అందించిన..

మడుగు మండలం గుండి గ్రామ పంచాయితీ పాలకవర్గం 2019-2024 లో సేవలు అందించినందుకు గాను గుండి గ్రామ సర్పంచ్ మానస ప్రవీణ్ గ్రామ పంచాయితీ సిబ్బందిని, 5 సంవత్సర కాలంలో పంచాయితీ కార్యదర్శులుగా విధులు నిర్వహించిన నాగెల్లి జ్యోతి, తోట్ల మల్లేశం, దాడి మహేందర్ ను అంగన్వాడీ టీచర్ లు, అష కార్యకర్తలు, వార్డు సభ్యులను, సన్మానించారు.

- Advertisement -

ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో భాగంగా 5 సంవత్సర కాలంలో గ్రామ పంచాయితీ కార్యాలయం విధులలో వారు చేసిన సేవలు మరువలేనివి, వారందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరోనా సమయంలో కూడా మంచి సేవలు అందించగలిగామని, మీ అందరి సేవలు మరువలేనివనీ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్థులు వార్డు సభ్యులు సిబ్బంది గ్రామ ప్రజలు అందరు కలసి గుండి సర్పంచ్ మానస ప్రవీణ్ ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మెడి శ్రీనివాస్ వార్డు సభ్యులు సిలువెరి రిషిత తిరుపతి, మెడి మహేశ్, పారునంది అంజమ్మ కొమురయ్య, ఉత్కం రాజమల్లయ్య, మానుపటి పద్మ, ముంజాల రజిత ప్రవీణ్, బొమ్మరవెని శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ లు, ఆషా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News