Thursday, September 19, 2024
HomeతెలంగాణRasamai Balakishan: ప్రజలే నా బలం, బలగం

Rasamai Balakishan: ప్రజలే నా బలం, బలగం

ముఖ్యమంత్రి కేసీఆర్, బీ.ఆర్.ఎస్.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల పిలుపు మేరకు మానకొండూరు ఎమ్మెల్యే డా.రసమయి సారధ్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తిమ్మాపూర్ మండలం బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన వేడుకలు అంబరాన్నంటాయి. ఈ ఆత్మీయ సమ్మేళనానికి భారీగా తరలి వచ్చారు బీ.ఆర్.ఎస్.పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, బీ.ఆర్.ఎస్. పార్టీ కరీంనగర్ జిల్లా ఇంఛార్జి బసవరాజు సారయ్య, బీ.ఆర్.ఎస్. పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ జీవి రామకృష్ణారావు లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ చేపట్టి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలలతో పాటు మానకొండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజలకు సేవ చేస్తూ, మానకొండూర్ నియో జకవర్గాన్ని అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చేశారని, ముచ్చటగా మూడవ సారి కూడా పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నామంటూ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హామీ ఇస్తూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రసమయి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ అండదండలతో మానకొండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అనేక అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను పూర్తి చేశానని, ప్రజలే నా బలం బలగo మని అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎంపీపీ కేతిరెడ్డి వనిత- దేవేందర్ రెడ్డి, జడ్పిటిసి ఇనుకొండ శైలజ-జితేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయం చైర్మన్ అనిల్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్, తిమ్మాపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ రావుల రమేష్, వైస్ ఎంపీపీ ఎల్ వీరారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, సర్పంచులు బోయిని కొమురయ్య, దుండ్రా నీలమ్మ-రాజయ్య, జక్కాని శ్రీవాణి-రవీందర్, మేడి అంజయ్య లతో పాటు పలు గ్రామాల సర్పంచులు, జడ్పిటిసిలు, రైతుబంధు, రైతు సమన్వయ కమిటీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News