Thursday, September 19, 2024
HomeతెలంగాణRasamai: అభివృద్ధికి పట్టం

Rasamai: అభివృద్ధికి పట్టం

అద్భుతంగా గ్రామాలను తీర్చిదిద్దుకున్నాం

ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధ ధ్యేయంగా పని చేసిందని, ఎన్నికల్లో ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని చూసే బిఆర్ఎస్ కి పట్టం గట్టాలని, కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంలోకి పోతుందని మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ అన్నారు. శంకరపట్నం మండలంలోని రాజాపూర్, కన్నాపూర్, ధర్మారం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో ప్రజాబంధు రసమయికి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. బతుకమ్మలు, కోలాటంతో స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్ ప్రచారంలో మాట్లాడుతూ గతంలో గ్రామ అభివృద్ధికి దూరంగా ఉండేదని బిఆర్ఎస్ పాలనలో గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. సీసీ రోడ్లు, కుల సంఘ భవనాలు, మహిళా సంఘ భవనాలు నిర్మించుకున్నామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గంట మైపాల్, సర్పంచులు కాటం వెంకటరమణారెడ్డి, పిన్ రెడ్డి వసంత నరసింహారెడ్డి, చుక్కల రవి, ఎంపీటీసీలు మోతే భాగ్యలక్ష్మి ఎల్లారెడ్డి, మాతాంగి లక్ష్మి , గ్రామ శాఖ అధ్యక్షులు నూనె శ్రీనివాస్, నరహరి తిరుమల్ రెడ్డి, దేవునూరి సమ్మయ్య, సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News