Friday, September 20, 2024
HomeతెలంగాణEllareddypeta: రేవంత్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల జోష్

Ellareddypeta: రేవంత్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల జోష్

విభేదాలు మరచి పోరాడమంటూ సందేశం..

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. కామారెడ్డి నుండి సిరిసిల్ల వెళుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను రేవంత్ రెడ్డి కలిసి, ప్రతి ఒక్కరూ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు పార్టీ నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వచ్చిందని అంటున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త నూతన ఉత్తేజంతో పనిచేసి కేకే.మహేందర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొమ్మాటి నరసయ్య, గౌస్, సద్ది లక్ష్మారెడ్డి, బాబు, శ్రీనివాస్, సతీష్, లింగం గౌడ్, నాగరాజు, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News